మహనీయుల మాసోత్సవ సంచిక ఆవిష్కరణ
జననిర్ణయం పత్రిక మహనీయుల మాసోత్సవాల ప్రత్యేక సంచికను శనివారం రోజున నల్లబెల్లి మండల ఎస్ ఐ వి గోవర్ధన్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్ ఐ గోవర్ధన్ మాట్లాడుతూ. మహనీయుల యొక్క మాసోత్సవాలు జరపడం చాలా ఆనందంగా ఉందని మహనీయుల ఆశయాలను ,జీవిత చరిత్రను యువత తెలుసుకోవాల్సిన అవసరం ఉందని మహనీయుల త్యాగాల వలన ఈ రోజున అందరూ సత్ఫలితాలు అనుభవిస్తున్నారని ఈ సందర్భంగా అన్నారు ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు రొట్టె సురేష్ ,ప్రధాన కార్యదర్శి వల్లే రమేష్ యాదవ్, ఉపాధ్యక్షులు వల్లోజు సురేష్ ప్రెస్ క్లబ్ వర్కింగ్ ప్రెసిడెంట్ అడ్డ సతీష్ ,దళిత విద్యావంతుల వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి బట్టు సాంబయ్య పాల్గొన్నారు.