*ఫసల్ భీమా యోజన పధకాన్ని రాష్ట్రంలో అమలు చేయాలి.*
*-తడుక వినయ్ గౌడ్.*
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నా ఫసల్ భీమా యోజన పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయాలని బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు తడుక వినయ్ గౌడ్ అన్నారు.శుక్రవారం నల్లబెల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వడగండ్ల వానకు పంట నష్టపోయిన రైతులను సర్వే చేసి ప్రభుత్వం ఆదుకోవాలని,ఎకరాకు రూ.50 వేలు నష్టపరిహారం అందిచలన్నారు.కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలన్నారు.ఫసల్ భీమా యోజన పథకాన్ని రాష్ట్రంలో అమలు చేసి ఉంటే నష్టపోయిన రైతులకు 60% వరకు నష్ట పరిహారం అందేది అని అన్నారు.ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేయకుండా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నా ఫసల్ భీమా యోజన అమలు చేసి రైతులకు న్యాయం చెయ్యాలన్నారు.ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా కౌన్సిల్ మెంబర్ బొద్దిరెడ్డి ప్రతాపరెడ్డి, మండల నాయకులు గుగులోతు తిరుపతి,ఈర్ల నాగరాజు,భూక్యా మైభూ, కడియాల విజయ్,కొండ్లె రమేష్, గుగులోతు రాందాన్,సుమన్ పాల్గొన్నారు.