నల్లబెల్లి మండల వికసిత్ భారత్ మండల సంకల్ప సభ

నల్లబెల్లి మండల వికసిత్ భారత్  మండల సంకల్ప సభ

11 సంవత్సరాల నరేంద్ర మోడీ ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమలపై అమృత్ కాల వికసిత భారత్ సంకల్ప సభను నల్లబెల్లి మండల కేంద్రంలో బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు తడుక వినయ్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బీజేపీ జిల్లా ప్రధానకార్యదర్శి గోగుల రాణా ప్రతాప్ రెడ్డి విచ్చేసి మాట్లాడుతూ…11 సంవత్సరాల నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులను అభివృద్ధి సంక్షేమ ఫలాలను ప్రతి కార్యకర్త గ్రామ గ్రామాన తెలియజేయాలని ఎన్నో సంవత్సరాలుగా దేశంలో అభివృద్ధికి నోచుకోని గ్రామాలను అభివృద్ధి పథంలో ముందుకు సాగేలా విప్లవాత్మక నిర్ణయాలను నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిందని 11 సంవత్సరాల కాలంలో దేశ ఆర్థిక వ్యవస్థను నాలుగో స్థానంలో తీసుకొచ్చిన ఘనత నరేంద్ర మోడీ ప్రభుత్వం చేసింది అని  అలాగే అన్ని రంగాలలో యువతకు ఉపాధి అవకాశాలలో  మహిళలకు సాధికార స్వలంబన కోసం 33 శాతం రిజర్వేషన్లు  ఎన్నో కేంద్ర ప్రభుత్వ పథకాలలో మొదటి ప్రాధనం మహిళలకు ఇవ్వబడుతుందని  వృద్ధులకు ఆయుష్మాన్ భారత్ ను రైతులకు మద్దతు ధర,కిసాన్ సామాన్ నిధి,ఫసల్ బీమా యోజన  ఇలా ఎన్నో రకాలుగా అన్ని వర్గాలకు నరేంద్ర మోడీ ప్రభుత్వం దగ్గర అయిందని మూడు నెలల రేషన్ బియ్యం ఒకేసారి ఇవ్వడం ఆపరేషన్ సింధూర ద్వారా దేశ రక్షణ విషయంలో రాజీ పడేది లేదని మరోసారి రుజువు అయిందని ఆయన తెలిపారు.రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు రేసు శ్రీను,జిల్లా కార్యదర్శి తడుక అశోక్ గౌడ్, మహబూబాబాద్ పార్లమెంట్ కో-కన్వీనర్ కట్ల రామచందర్ రెడ్డి,ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి గడ్డం ఆంజనేయులు,వరంగల్ జిల్లా కౌన్సిల్ మెంబర్ బొద్దిరెడ్డి ప్రతాపరెడ్డి,మండల కమిటీ సభ్యులు బూత్ అధ్యక్షులు,సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *