*రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీల్లో మెడిసిటీ నర్సింగ్ విద్యార్థుల ప్రతిభ*

మేడ్చల్, ఆగస్టు 5(పీపుల్స్ డైరీ):-
సంగారెడ్డిలో జరిగిన రాష్ట్ర స్థాయి వాలీ బాల్ పోటీలలో మెడిసిటి కాలేజీ ఆఫ్ నర్సింగ్ విద్యార్థులు విశేష ప్రతిభ చూపి ఘన విజయం సాధించారు. తెలంగాణ నర్సింగ్ అసోసియేషన్ ప్రతి ఏటా నిర్వహించే రాష్ట్ర స్థాయి వాలీ బాల్ పోటీలలో మహమ్మద్ కైఫ్ నాయకత్వంలో మెడిసిటి కాలేజీ ఆఫ్ నర్సింగ్ విద్యార్థులు ట్రోఫీ సాధించారు. ఈ నెల 2 న సంగారెడ్డిలోని యం యన్ ఆర్ మెడికల్ కాలేజీ ఆవరణలో జరిగిన ఫైనల్స్ లో విజయం సాధించి మెడిసిటీ తెలంగాణా నర్సింగ్ కౌన్సిల్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్. విద్యలత చేతుల మీదుగా ట్రోఫీ అందుకొన్నారు. ఈ సందర్భంగా గెలుపొందిన విద్యార్థులను షేర్ మెడికల్ కేర్ ఫౌండేషన్ ప్రెసిడెంట్, ప్రొఫెసర్ శివరామకృష్ణ డైరెక్టర్ డా. సి మల్లికార్జున రెడ్డి, మెడిసిటీ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డా. హైమావతి, శ్రీరాముల కళాశాల ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, కోచ్ జి శివారెడ్డిలు అభినందించారు.
ఈ సందర్బంగా ప్రొఫసర్ శివరామకృష్ణ మాట్లాడుతూ విద్యార్థులు చదువులలోనే కాకుండా తమకు ఇష్టమైన కార్యకలాపాలలో కూడా ప్రతిభ కనపరచడానికి ముందంజలో ఉండాలని సూచించారు. ఆటల ద్వారా ఆరోగ్యమే కాకుండా మంచి నాయకత్వ లక్షణాలు కూడా పెంపొందుతాయని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఫ్రొఫెసర్ శివరామకృష్ణ, ప్రెసిడెంట్, షేర్ మెడికల్ కేర్ ఫౌండేషన్ – డా. సి మల్లికార్జున రెడ్డి, డైరెక్టర్ అకడమిక్స్, షేర్ మెడికల్ కేర్ ఫౌండేషన్ – డా. హైమావతి శ్రీరాముల, ప్రిన్సిపాల్, మెడిసిటీ నర్సింగ్ కళాశాల జి.శివారెడ్డి, కోచ్, కళాశాల ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ తో పాటూ మహమ్మద్ కైఫ్ తదితరులు పాల్గొన్నారు.