భూపాలపల్లిలో భారీ వర్షం
– జిల్లా వ్యాప్తంగా 405.9 మి.మీ నమోదు

గణపురం, ఆగస్టు 18 (పీపుల్స్ డైరీ): జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా సోమవారం సాయంత్రం వరకు 405.9 మి.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. మండలాల వారీగా పలిమెల 73.0 మి.మీ, భూపాలపల్లి 57.3 మి.మీ, మహముత్తారం 35.3 మి.మీ, గణపురం 30. మి.మీ, కాటారం 25.9 మి.మీ, మల్హర్ 24.7 మి.మీ, మహాదేవపూర్ 23.6 మి.మీ, చిట్యాల 22.3 మి.మీ, కొత్తపల్లి గోరి 20.8 మి.మీ, టేకుమట్ల 18.3 మి.మీ, రేగొండ 17.5 మి.మీ, మొగుళ్లపల్లి 17.3 మి.మీ వర్షపాతం నమోదైంది.