స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుతాం.

స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుతాం.
గోగుల రాణా ప్రతాప్ రెడ్డి.

జరగబోయే స్థానిక సంస్థలు ఎన్నికల్లో తమ పార్టీ సత్తా చాటుతుందని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గోగుల రాణా ప్రతాప్ రెడ్డి అన్నారు.ఆదివారం రంగాపురం,నందిగామ ఎంపిటిసి స్థాయి స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశం పార్టీ మండల అధ్యక్షుడు తడుక వినయ్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి ముఖ్యఅతిధిగా గోగుల రాణా ప్రతాప్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ….స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీ తరఫున అన్ని స్థానాల్లో పోటీ చేసి అభ్యర్థులను గెలిపించుకుంటామని ఆయన పేర్కొన్నారు.కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను గడపగడపకు తీసుకెళుతూ కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఎండగట్టాలన్నారు.స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించుటలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని హైకోర్టు స్టే విధించడం ద్వారా మరోసారి నిరోపితమైందన్నారు.తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఆదరాబాదరాగా చెల్లని జీవో తెచ్చి తామేదో బీసీ సామాజికవర్గాన్ని ఉద్ధరిస్తున్నట్టు షో చేసి చట్టం ముందు బోర్లా పడిందని అన్నారు.రిజర్వేషన్ల పేరుతో బీసీలకు అన్యాయం చేయాలని చూస్తే రాబోయే స్థానిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరుపున అత్యధిక స్థానాల్లో బీసీలకు అవకాశం కల్పిస్తామన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ బొద్దిరెడ్డి ప్రతాపరెడ్డి, దళిత మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి పృద్వి, జిల్లా నాయకులు వనపర్తి మల్లయ్య,బచ్చు వెంకటేశ్వర్ రావు,వల్లే పర్వతాలు, మండల ప్రధాన కార్యదర్శిలు ఈర్ల నాగరాజు,గుగులోతు తిరుపతి,ఉపాధ్యక్షులు గుర్రపు నరేష్,కార్యదర్శి మర్రి నాగరాజు,కోశాధికారి మురికి మనోహర్, మండల నాయకులు ఓరుగంటి రాజు,ములుక రాజేష్, నాగిరెడ్డి రాజిరెడ్డి,కౌడగాని రాజేందర్,తిమ్మాపురం శివ, జంగిలి పద్మ,బూత్ అధ్యక్షులు బల్ల రాజు,చెట్టుపెల్లి విజేందర్, కంచె రవి, భూక్య రాజేంద్రప్రసాద్ తో పాటు కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *