- ప్రయాణికుల ఇబ్బందులు
- హైదరాబాద్ మెట్రోలో సాంకేతిక లోపం..
పీపుల్స్డైరీ`హైదరాబాద్ : హైదరాబాద్ మెట్రో ట్రైన్లలో సాంకేతికలోపం తలెత్తింది. దీంతో ట్రైన్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. నాగోల్ -రాయదుర్గం, ఎల్బీ నగర్ – మియాపూర్ కారిడార్లలో ట్రైన్లు నిలిచిపోయాయి. దాదాపుగా 30 నిమిషాలకు పైగా మెట్రో సేవలకు అంతరాయం ఏర్పడిరది. ఉద్యోగులు ఆఫీసుకు, విద్యార్థులు కాలేజీలకు వెళ్లే సమయం కావటంతో మెట్రో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అన్ని మెట్రో స్టేషన్లలోనూ ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగింది. ట్రైన్లు సకాలంలో రాకపోవటంతో మెట్రో ప్లాట్ఫాంపై ప్రయాణికులు భారీగా చేరుకుంటున్నారు. అమీర్పేట్ మెట్రో స్టేషన్లో అయితే ఇసుకేస్తే రాలనంతగా ప్రయాణికులు ప్లాట్ఫాంపై నిరీక్షిస్తున్నారు. ట్రైన్లలో ఉన్నవారు ట్రైన్లలో.. స్టేషన్లలో ఉన్నవారు స్టేషన్లలోనే ఉండిపోయారు. అయితే ఈ అంతరాయంపై హైదరాబాద్ మెట్రో అధికారులు ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటన చేయలేదు.